ప్రభాస్ పై సంచలన ట్వీట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ..!!

-

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వారుండరు. ఎందుకంటే  ప్రస్తుతం తాను తన సినిమా లతో కాకుండా తన ట్వీట్స్ తోనే క్రేజ్ సంపాదిస్తూ వున్నాడు. ఎలాంటి ఇష్యూ వచ్చినా తన దైన శైలిలో ట్వీట్ చేస్తూ  అందరిని తన వైపుకు తిప్పుకుంటారు. అలాగే తన సినిమాలకు తన ట్వీట్స్ తోనే ప్రచారం చేసుకుంటారు. ఏదైనా బలంగా చెప్పాల్సి వేస్తే, అవతలి వారిని నోరు తెరవకుండా తన ట్వీట్స్ తోనే ఉక్కిరి బిక్కిరి చేస్తారు. ఏదైనా విషయాన్ని అనుకూలం గా వ్యతిరేకంగా కూడా చెప్పగలిగే టాలెంట్ రామ్ గోపాల్ వర్మ సొంతం.

మరోసారి రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్స్ తో  హీరో ప్రభాస్ ను, మరియు ఫ్యాన్స్ ను కవ్వించే ప్రయత్నం చేశారు.నిన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్‌ చేసిన రచ్చపై  తన దైన స్టయిల్ లోస్పందించారు. నిన్న బిల్లా విడుదల సందర్భంగా థియేటర్‌లోనే అభిమానులు బాణాసంచా కాల్చడంతో థియేటర్స్ లో అగ్ని ప్రమాదం జరిగి కొన్ని సీట్స్ కాలి పోయాయి. దీనిపై ఆర్జీవీ  స్పందిస్తూ ప్రభాస్ అభిమానుల పిచ్చి  పనులు అంటూ ట్వీట్ చేశారు.

అలాగే ఇవాళ దీపావళి సందర్భంగా చేసిన మరో ట్వీట్ ఇన్ డైరెక్ట్ గా ప్రభాస్ ను టార్గెట్ చేశాడు. దానిలో కొంత వెటకారం కలిపాడు.తన ట్వీట్ లో  ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ ఇప్పడు రీ రిలీజ్ చేసి ఉంటే బాహుబలి కంటే పెద్ద హిట్ అయ్యేదంటూ పోస్ట్‌ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ వర్మ పై విరుచుకు పడ్డారు

Read more RELATED
Recommended to you

Latest news