తనపై దాడి భయం తో ఇంటికే వెళ్లని రష్మిక..!!

-

ఇప్పడు కర్నాటక లో కాంతారా సినిమా విషయంలో రష్మిక మీద విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఆమె సినిమాలను బ్యాన్ చేయాల్సిందిగా టాక్ నడుస్తోంది. రిషిబ్ శెట్టి తీసిన కాంతారా సినిమాని అందరూ పొగుడుతున్నా కాని, కన్నడ హీరోయిన్ అయ్యి ఉండి కూడా ఇప్పటివరకు సినిమా చూడలేదని తాపీగా చెప్పడంతో కన్నడ ప్రజలు మండి పడుతున్నారు. అదీ కాక ఫేమ్ వచ్చిన తర్వాత కన్నడ సినిమా వైపు చూడటం లేదని ఆమె పై కోపంతో ఉన్నారట. దీనితో ఆమెను బ్యాన్ చేయాల్సిందిగా కోరుతున్నారట.

అయితే ఈ వివాదం మీద రష్మిక తాజాగా వివరణ కూడా ఇచ్చింది.కాంతర సినిమా వివాదం గురించి కూడా మాట్లాడుతూ మీడియా వాళ్ళు నన్ను ఈ ప్రశ్న అడిగినప్పటికీ నేను నిజంగానే ఈ సినిమా చూడలేదు అందుకే చూడలేదని చెప్పాను.సినిమా చూసిన తర్వాత సినిమా చాలా అద్భుతంగా ఉంది అంటూ చిత్ర బృందానికి కంగ్రాట్స్ అని మెసేజ్ కూడా పెట్టానని వాళ్లు కూడా థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చారని తెలిపింది. అయినా కూడా అక్కడి వాళ్ళలో ఆగ్రహం తగ్గలేదని తెలుస్తోంది.

దీనితో విపరీతంగా భయపడుతున్న రష్మిక సొంత ఊరు మంగుళూరు  కూడా వెళ్ళడం లేదట. కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పడు అక్కడ జరిగేది చెపుతూ ఆమెను ఇప్పుడే రావద్దని చెప్పారట. ఇప్పుడు షూటింగ్ ఉంటే స్పాట్ లొకేషన్ కు వెళ్ళడం లేదంటే హోటల్ లోనే ఉండి పోవడం చేస్తుందని తెలుస్తోంది. అలాగే ఎక్కువుగా హైదరాబాద్, ముంబయ్‌ మధ్య తిరుగతూ తన పనులు పూర్తి చేసుకుంటూ ఉందట. కన్నడ ప్రజలలో ఎప్పుడు ఆగ్రహం తగ్గుతోందో అమ్మడు ఎప్పుడు ఇంటికి వెళుతుందో వేచి చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version