రోజంతా చాలా సింపుల్ గా గడిచిపోయింది… రష్మిక మందన..!

-

  1. నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రష్మిక మందన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక సినిమాల్లో నటించిన రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ఈమధ్యే రష్మిక మందన నటించిన పుష్ప సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో సామి సామి అనే పాటకు రష్మిక మందన వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. ఇలా సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని అలరిస్తున్న రష్మిక మందన సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా నేషనల్ క్ క్రష్ రష్మీక మందన నిన్న చేసిన పనుల గురించి చెప్పుకొచ్చింది.

జనవరి 28 న ఎలా గడిచిందో రష్మిక మందన ఓ చిన్న పాటి డైరీలా రాసుకొచ్చింది. ఇలా డైరీ అంటూ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేయడం ఈ ముద్దుగుమ్మకు అలవాటే. అయితే జనవరి 28 వ తేదీన ఎలా గడిచిందో రష్మిక మందన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. డియర్ డైరీ… ఇది రాయక చాలా రోజులు అవుతోంది… నిద్రలేచాను… కానీ ఏదోలా అనిపించింది… మళ్లీ పడుకున్నాను… నా బాడీకి రెస్ట్ ఇవ్వాలని పడుకున్నాను మళ్లీ లేచాను… ఉదయం వర్కవుట్ చేయలేదు… బ్రేక్ ఫాస్ట్ చేయలేదు… వర్క్ కి సంబంధించిన ఫోన్ కాల్స్ మాట్లాడాను… ఏదో ఒక సినిమాను చూశాను… ఆడవాళ్ల మీకు జోహార్లు సినిమా అప్డేట్ ఇచ్చాం… మీరంతా కూడా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారా?. ఆ తరువాత జిమ్‌లోకి వెళ్లాను… లైట్‌గా వర్కవుట్లు చేశాను… తిరిగి వచ్చాను… డిన్నర్ చేశాను… మళ్లీ ఓ సినిమాను చూశాను.. అలా రోజు మొత్తం సింపుల్‌గా గడిచింది అని రష్మిక మందన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news