ప్రధాని మోడీ కి రేవంత్ లేఖ

-

దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పీఎం మోడీకి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను, అలాగే నిరాశ్రయులను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇక అటు భారీ వర్షాల నేపథ్యంలో చోటుచేసుకున్న ప్రకృత్తి విపత్తు, తద్వారా గోదావరి పరీవాహక ప్రాంతం లో పోటెత్తిన వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (ఆదివారం) ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. సిఎం గారి ఏరియల్ సర్వే కడెం నుంచి భధ్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగనున్నది. ఈ సర్వేలో సిఎం గారితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news