ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిశగా కెసిఆర్, జగన్ కుట్రలు: రేవంత్ రెడ్డి మరో బాంబు

-

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పాదయాత్ర చేయడం, ప్లీనరీలో తెలుగు తల్లి బొమ్మ, ఏపీ లో పార్టీ ప్రస్తావన.. మంత్రి పేర్ని నాని సమర్ధన ఇవ్వన్నీ.. తెలంగాణా ప్రజలపై చేస్తున్న కుట్రలా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిశగా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ల కుట్ర లు చేస్తున్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు రేవంత్. ప్లీనరీలో తెలుగు తల్లి ప్రత్యక్షమవుతే, వాటిని మేము సాక్షాలతో చూపిస్తే.. TRS మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలేదు.? అని ఫైర్ అయ్యారు. ప్రాజెక్ట్ పై స్టే విషయం లో కేసీఆర్ ఇంకా ఎందుకు మాట్లాడలేదు.? అని ప్రశ్నించారు.

ఏపీ నాయకులు మళ్ళీ రాష్ట్రాల్ని కలుపుదాం అంటే టిఆర్ఎస్ నాయకులు ఎందుకు స్పందించడం లేదు.? అని నిలదీశారు. తెలంగాణపై కన్నెత్తి చూస్తే కండ్లు పీకేస్తా అంటవు, మరి ఇప్పుడు ఎందుకు నోరు ఎత్తుతలేవు.? అని అగ్రహించారు. త్యాగాలు చేసి రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, కుటుంబ స్వార్థం కోసం తెలంగాణకి అన్యాయం చేస్తే, ప్రజలు చెంపలు పగులగొడ్తరని హెచ్చరించారు. కేసీఆర్ స్వార్థం ముందు, ఆయన రాక్షస క్రీడ ముందు..పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సమాధి అయిందని ఫైర్ అయ్యారు. నీళ్లు నిధులు నియమాల కోసం తెలంగాణ వచ్చిందని.. కానీ రాష్ట్ర ప్రజల హక్కులను జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర కేసీఆర్ పెట్టాడని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news