కేసీఆర్ తెలంగాణ బిడ్డేనా.. DNA టెస్ట్ చేయాల్సిందే : రేవంత్‌రెడ్డి

-

తెలంగాణ సిఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కెసిఆర్ తెలంగాణ వాడేనా ? ఆయన డిఎన్ఏ టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆఅ టెస్ట్ చేసి.. అసలు తెలంగాణ వాడేనా అని తేల్చాలన్నారు. టీ హబ్ నిర్మాణం లో కోట్ల రూపాయలు కొల్లగొట్టింది అని కాగ్ చెప్పిన సంస్థ నే… అమర వీరుల స్తూపం నిర్మాణం పనులు ఇచ్చిందన్నారు.

revanth-reddy-cm-kcr

2017లో అమర వీరుల స్తూపం నిర్మాణంకి 80 కోట్లు కేసీఆర్ సర్కార్ కేటాయించిందని.. ఏడాది వరకు అసలు స్థూపం గురించి పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. 2018 లో టెండర్ పిలిచారని.. డిజైన్ అయ్యాక 63 కోట్ల 75 లక్షల తో టెండర్ పిలిచారన్నారు. ఏడాదిలో పూర్తి చేస్తాం అని కెసిఆర్ చెప్పారని.. టెండర్ రెండు సార్లు వాయిదా వేసిందని.. ఈ టెండర్ కెపిసి ప్రాజెక్ట్ లిమిటెడ్ కి ఇచ్చిందని మండిపడ్డారు.

కామిషెట్టి పుల్లయ్య కంపెనీ పొద్దుటూర్ శెట్టి గారిది కంపెనీ అని.. కంపెనీకి ఎలాంటి అనుభవం లేకున్నా…తప్పుడు సర్టిఫికెట్ తో పనులు అప్పగించారని నిప్పులు చెరిగారు. అమరవీరుల స్థూపం నిర్మాణం పొద్దు టురు వారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని.. తెలంగాణ లో ఎవరు అర్హులు లేరా ? అని నిలదీశారు. పిడికెడు ఆంధ్ర కాంట్రాక్టర్ లు తెలంగాణ నీ దోచుకుంటున్నారు అని చెప్పింది నువ్వే కదా అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news