మంత్రి కేటీఆర్ చేస్తున్న ఈ ఆగడాలను కేసీఆర్ అడ్డుకోవాలి : రేవంత్‌ రెడ్డి

-

టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జూబ్లీహీల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలకు పర్మిషన్ లు ఇస్తుందని వివిమర్శించారు. మంత్రి కేటీఆర్ చేస్తున్న ఈ అక్రమాలను సీఎం కేసీఆర్ అడ్డుకోవాలన్నారు. మంత్రి రాజయ్యను బర్తరఫ్ చేసినట్టు కేటీఆర్ ను కూడా కెసిఆర్ బర్తరఫ్ చేయాలని కోరారు. అలా చేస్తే కేసీఆర్ కు పాప ప్రక్షాళన జరుగుతుందాని తెలిపారు. కేబీఆర్ పార్క్ చారిత్రాత్మక వారసత్వ సంపదని.. కేబీఆర్ పార్క్ లో జాతీయ పక్షి నెమలితో పాటు ఎన్నో విలువైన వన్యప్రాణులు ఉన్నాయని తెలిపారు రేవంత్. అందుకే కేంద్ర ప్రభుత్వం పార్క్ చుట్టూ నిర్మాణాలకు ఎన్నో నియమ నిబంధనలు పెట్టిందన్నారు రేవంత్.

Congress will bag 80 seats in Assembly elections: Revanth Reddy

జూబ్లీహీల్స్ చెక్ పోస్ట్ దగ్గర నిబంధనలకు విరుద్దంగా మంత్రి డెవ్లపర్స్ కు 15 అంతస్తుల నిర్మాణాలకు అనుతిచ్చారని మండిపడ్డరు రేవంత్. 2006 లో కాంగ్రెస్ హయాంలో ఫైవ్ స్టార్ హోటల్ కోసం టెండర్లు పిలిచారని తెలియచేశారు. 2006లో మూడు అంతస్తులకు షరతులతో కూడిన అనుమతిచ్చారని.. అయితే 2016లో కేసీఆర్ డెవ్ లపర్స్ అదనంగా ఫ్లోర్లకు అనుమతివ్వాలని అప్లికేషన్లు పెట్టుకుందని వెల్లడించారు. కేటీఆర్ తన స్నేహితుల కోసం, సత్యం రాజుల కోసం నిబంధనలు తుంగలో తొక్కారని రేవంత్ మండిపడ్డారు. కేటీఆర్ నగరాన్ని విధ్వంసం చేసి హైదరాబాద్ నగర చరిత్రను కనుమరుగు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో మీరు తవ్విన గోతుల్లోనే మిమ్మల్ని పాతిపెడతామంటూ రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్సోళ్లకు ఆంధ్రానే దిక్కని.. ఆపై బంగాళాఖాతమేనని అన్నారు ఆయన.

 

 

Read more RELATED
Recommended to you

Latest news