ఢిల్లీలోనే దిగ్విజయ్ సింగ్ ని కలిసిన రేవంత్ రెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకి మరోసారి షాక్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ లో రెండు వర్గాలుగా చీలిపోయిన నేతలను బుజ్జగించేందుకు దిగ్విజయ సింగ్ హైదరాబాద్ కి వస్తున్న నేపథ్యంలో.. పార్టీ సీనియర్లతో పాటు ఇరు వర్గాల నేతలతో ఆయన భేటీ కానున్నారు. పార్టీలో అటు సీనియర్లు, ఇటు కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల అభిప్రాయాలను దిగ్విజయ్ సింగ్ తీసుకొని హై కమాండ్ కి పంపనున్నారు.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాత్రం ముందుగానే ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ ని కలిసి పార్టీ స్థితిగతులపై వివరించినట్లు తెలుస్తోంది. దిగ్విజయ్ సింగ్ రేపు హైదరాబాద్ కి రానున్నారు. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే రేవంత్ రెడ్డి దిగ్విజయ్ సింగ్ ని కలిసి రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి చర్చించడం చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news