రేవంత్‌ రెడ్డి సర్కారుది ప్రజా పాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన : బీజేపీ ఎల్‌పీ నేత

-

కాంగ్రెస్‌ పార్టీ తెచ్చిన ప్రతి స్కీమ్‌లో స్కామ్‌ ఉంటుందని.. రేవంత్‌ రెడ్డి సర్కారుది ప్రజా పాలన కాదని.. ప్రజా వ్యతిరేక పాలన అని బీజేపీ ఎల్‌పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని మరోసారి మోసం చేసిందని, రుణమాఫీ మొత్తం చేయకముందే సంబరాలు చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. ప్రజల సొమ్ము ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదనని.. రూ.2లక్షల రుణమాఫీ అని చెప్పి ఆంక్షలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కొంతమందికే చేసి మిగతా రైతులకు ఆంక్షలు పెట్టారన్నారు.

రైతు పాస్‌బుక్‌ ఆధారంగా రుణమాఫీ అని చెప్పి రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం, మెదక్ , మహబూబ్‌నగర్ జిల్లాలో చాలామంది రైతులకు రుణమాఫీ కావడం లేదని.. రూ.రెండు లక్షల రుణమాఫీ ప్రతీ రైతుకు కావాలని.. లేనట్లయితే అసెంబ్లీ, సచివాలయం ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు.రైతు భరోసా యాసంగి పంటకు ఇవ్వలేదని.. ఇప్పుడు వానాకాలం పంటకు కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని విరుచుకుపడ్డారు. రేవంత్ సర్కార్ రైతు, విద్యార్థి, నిరుద్యోగ, ప్రజావ్యతిరేక ప్రభుత్వం అంటూ మహేశ్వర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version