డైనింగ్ టేబుల్ ను ఈ దిశలో పెడుతున్నారా? అయితే సమస్యలు తప్పవు..!

-

ఇంట్లో వాస్తు నియమాలను పాటించడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని పెంచుకోవాలంటే తప్పకుండా వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను పాటించాలి. ఎప్పుడైతే వాస్తు నియమాలను పాటించి వస్తువులను సరైన విధంగా ఏర్పాటు చేస్తారో మరియు సరైన దిశలో పెడతారో, ఎంతో ప్రయోజనం ఉంటుంది. పైగా, సానుకూల శక్తి ఎక్కువ అవుతుంది మరియు ఎన్నో ఇబ్బందుల నుండి కూడా బయటపడడానికి సహాయం చేస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం, డైనింగ్ టేబుల్ ను ఇంట్లో పెట్టినప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటించడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. డైనింగ్ టేబుల్ ను ఎప్పుడైతే సరైన దిశలో పెడతారో, సానుకూల శక్తి ప్రవహిస్తుంది, దీంతో ఇంట్లో ఉండే సమస్యలు తగ్గిపోతాయి. డైనింగ్ టేబుల్ ను పశ్చిమం, ఈశాన్యం, వాయువ్యం దిశలో ఉంచడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. కాకపోతే, తూర్పు దిశలో అస్సలు ఉంచకూడదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే తూర్పు దిశలో డైనింగ్ టేబుల్ ను పెడతారో, కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.

కనుక తూర్పు లేదా ఆగ్నేయ దిశలో కూడా డైనింగ్ టేబుల్ ను పెట్టకూడదు. ఇలా పెట్టడం వలన ఆహారం తినడంలో ఆసక్తి కూడా తగ్గిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. డైనింగ్ టేబుల్ ఎప్పుడూ ఎంతో శుభ్రంగా ఉండాలి, ఎటువంటి అనవసరమైన వస్తువులు లేకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వలన సానుకూల శక్తి ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా, డైనింగ్ టేబుల్ దగ్గర మంచి వెలుతురు వచ్చే విధంగా చూసుకోవాలి. దీంతో ఎంతో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కనుక, డైనింగ్ టేబుల్ ను ఇంట్లో పెట్టేముందు ఇటువంటి నియమాలు గురించి తెలుసుకొని, తగిన మార్పులను చేయడం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో ఆనందంగా జీవించవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news