యూపీలో ఘోర ప్రమాదం.. డంపర్ దూసుకెళ్లడంతో ఆరుగురు మృతి

-

ఉత్తర్​ప్రదేశ్ ఉన్నావ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే నిలబడి ఉన్న ముగ్గురు వ్యక్తులపైకి ఓ డంపర్​ దూసుకెళ్లింది అనంతరం ఓ మారుతీ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన ఉన్న ముగ్గురు వ్యక్తులు, మారుతీ కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు మరణించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

డంపర్‌ డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో డంపర్ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండొచ్చని.. అందువల్లే ఈ ఘటన చోటుచేసుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version