IND VS BAN : టీమిండియాకు గుడ్‌ న్యూస్..రోహిత్‌ రీ-ఎంట్రీ

-

IND VS BAN : టీమిండియాకు గుడ్‌ న్యూస్. రోహిత్‌ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బొటనవేలికి గాయమైన సంగతి తెలిసిందే.

చికిత్స కోసం అతడు భారత్ కు రావడంతో బంగ్లా తో మూడో వన్డే, తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. డిసెంబర్ 22 నుంచి బంగ్లాదేశ్ తో రెండు టెస్టు ప్రారంభంకానుంది.

ఈ మ్యాచ్ కు రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో టెస్ట్ ప్రారంభం అయ్యే నాటికి అతడు గాయం నుంచి కోలుకుంటాడని బీసీసీఐ వర్గాల సమాచారం. త్వరలోనే రోహిత్ బంగ్లాదేశ్ చేరుకొని జట్టుతో కలిసి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news