డ‌బుల్ డోస్ టీకా తీసుకుంటేనే ఆర్ఆర్ఆర్ మూవీ.. ప్ర‌భుత్వానికి ఆర్జీవీ ఐడియా

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో పాటు స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ రాజ‌మౌళి కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ భాషల నుంచి కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7 పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల కాబోతుంది. అయితే రాష్ట్రంలో క‌రోనా కేసులు పెర‌గ‌డం తో పాటు ఓమిక్రాన్ వేరియంటు కూడా విస్త‌రించ‌డంతో పెద్ద పెద్ద సినిమాలు విడుద‌ల అవ‌డం పై రాష్ట్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నాయి.

అయితే దీని పై వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌భుత్వానికి అద్భుత‌మైన ఐడియా ఇచ్చాడు. ట్వీట్ట‌ర్ వేదిక‌గా.. ఓమిక్రాన్ గురించి ప్ర‌భుత్వానికి కావాల్సిన గొప్ప ఐడియా త‌న వ‌ద్ద ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల అయిన‌ప్పుడు డ‌బుల్ డోస్ తీసుకున్న వారిని మాత్ర‌మే థీయేట‌ర్స్ ల‌కు అనుమ‌తి ఇవ్వాలి. ఆర్ఆర్ఆర్ సినిమా చూడాల‌నే ఉద్ధేశంతో అయినా.. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుంటారు. అని అన్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉన్న క్రేజ్ తో అభిమానులు నిజాంగానే రెండు డోసులు వేసుకుంటార‌ని ప‌లువురు కామెంట్ చేస్తున్నారు. ప్ర‌భుత్వానికి రామ్ గోపాల్ వ‌ర్మ మంచి ఐడియా ఇచ్చార‌ని కామెంట్ చేస్తున్నారు. అయితే మ‌రి కొంద‌రు మాత్ర‌మే ఈ సినిమా కోసం ఇప్ప‌టి కే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నమ‌ని మళ్లీ ఇప్పుడు ఆంక్ష‌లు పెట్ట‌కండి అంటు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news