ఉక్రెయిన్ లో షూటింగ్ అద్భుతంగా చేశాం…. యుద్ధం వస్తుందని ఊహించలేదు: రాజమౌళి

-

ట్రిపుల్ ఆర్ విడుదలకు సిద్ధం అవుతున్న సందర్భంలో దర్శకుడు రాజమౌళి సినిమా గురించి అనేక విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఉక్రెయిన్ లో అద్భుతంగా సినిమా షూట్ చేశామని.. అక్కడు యుద్ధం వస్తుందని ఊహించలేదని ఆయన అన్నారు. ఇది జీవిత చరిత్ర కాదని.. ఇది కేవలం ఫిక్షన్ మూవీ అని రాజమౌళి స్పష్టం చేశారు. బాహుబలి1,2 కన్నా ట్రిపుల్ ఆర్ పెద్ద సినిమా అని ఆయన అన్నారు. రామ్ చరణ్ లో స్థితప్రజ్ఞత ఎక్కువ… అందుకే రామ్ పాత్రకు ఎంచుకున్నా అని అన్నారు. ఎన్టీఆర్ నా మైండ్ ను వేగంగా చదివేస్తారంటూ పొగిడారు రాజమౌళి. సినిమాలో ఇంటర్వెల్ సీన్ తీయడానికి 60 రాత్రులు పట్టిందని ఆయన అన్నారు. ట్రిపుల్ ఆర్ ప్రిమియర్స్ డిస్ట్రిబ్యూటర్లు డిసైడ్ చేస్తారని.. మేం ప్రీమియర్స్ కావాలని కోరుకుంటున్నామని రాజమౌళి అన్నారు. మూడో లాక్ డైన్ వల్ల 3డీ వెర్షన్ రెడీ చేశాం అని అన్నారు. ఉక్రెయిన్ ప్రజలు చాలా సహకరించారని..అక్కడి ఫుడ్, కల్చర్ బాగా నచ్చాయని ఎన్టీఆర్ అన్నారు. ట్రిపుల్ ఆర్ తరువాత మరిన్ని మల్లీ స్టారర్ సినిమాలు వస్తాయని అన్నారు. రాజమౌళి రూపంలో గొప్ప గురువు వున్నాడు… అందువల్ల ఏ ఇబ్బంది కలగలేదు ఎన్టీఆర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version