ఇదేనా నెం. 1 పాలన అంటే ?: RS ప్రవీణ్ కుమార్

-

తెలంగాణ రాష్ట్రము వరంగల్ కాజీపేట లోని రైల్వే క్వార్టర్స్ దగ్గరలో ఈ రోజు ఉదయం వీధి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేయడంతో ఒక అబ్బాయి చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ ఘటనపై BSP రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ మునిసిపల్ మరియు ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ను ఒక రేంజ్ లో విమర్శించారు. తెలంగాణను పాలిస్తున్నది ఎవరు ? BRS పార్టీనా లేదా వీధి కుక్కలా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు వీధి కుక్కలు అభం శుభం తెలియని ఆ అమాయక బాలుడి ప్రాణాలను బలిగొన్నాయి. ఈ విధంగా జరగడం ఈ రాష్ట్రంలో ఇది మొదటిసారి కాదు , ఇంతకు ముందు కూడా చాలా ఘటనలు జరిగాయి. తెలంగాణాలో మీరు అధికారంలోకి వచ్చిన సమయంలో బంగారు తెలంగాణను చేస్తాం అంటూ ప్రగల్భాలు పలికారు.

ఇదేనా నెం.1 పాలన అంటే అని కేటీఆర్ ను ప్రశ్నించారు. దీనిపై మిమ్మల్ని స్పందించమని అడిగితే ఈ కుక్కలను కూడా ప్రతిపక్షాలే పంపించాయి అని అంతారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news