ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ మరో షాక్‌..రిజర్వేషన్ ఛార్జీలు పెంపు

-

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ మరో షాక్‌ ఇచ్చింది. గుట్టు చప్పుడు కాక ముందే… ప్రయాణికుల పై తెలంగాణ ఆర్టీసీ గుదిబండ వేసింది. తాజాగా…. రిజర్వేషన్ ఛార్జీలు అమాంతం పెంచేసింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. పెంచిన రిజర్వేషన్ ఛార్జీలపై ఇప్పటి వరకు అధికార ప్రకటన చేయలేదు తెలంగాణ ఆర్టీసీ.

ఒక్కో రిజర్వేషన్ పై 20 రూపాయల నుండి 30 రూపాయలకు పెంచింది టీఎస్ ఆర్టీసీ. గుట్టుచప్పుడు కాకుండా పెంచింది ఆర్టీసీ యాజమాన్యం. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. కాగా… గత నెలలో టోల్‌ సెస్, టిక్కెట్‌ ఛార్జీల సవరణ, ప్యాసింజర్‌ సెస్‌ ల పేరుతో సిటీ బస్సుల నుంచి గరుడ ప్లస్‌ బస్సుల వరకు ఛార్జీలు పెంచిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ.. తాజాగా రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news