వైఎస్ సునీతకు పులివెందుల టికెట్ ఇవ్వడమే చంద్రబాబు ప్లాన్ : సజ్జల

-

తాడేపల్లి : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చార్జిషీటు ఆధారంగా అవినాష్‌ రెడ్డికి శిక్ష వేయాలని చంద్రబాబు తీర్మానమా ? మొదట్నుంచి చంద్రబాబుది కుట్రల స్వభావమని అగ్రహించారు. అందుకే వివేకా కేసులో బాబు నీచమైన ప్రచారం చేస్తున్నారని.. సునీతను పులివెందుల టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టి కుటుంబాన్ని చీల్చాలి అని చంద్రబాబు వ్యూహమని చెప్పారు.

సీబీఐ పది అడుగులు చార్జిషీట్‌ వేస్తే బాబు వంద అడుగుల స్టేట్‌మెంట్ అని ఫైర్ అయ్యారు. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరగటమే కాదు జరుగుతోంది అన్న నమ్మకం కూడా కలగాలని… వైఎస్ హయాంలోనూ చంద్రబాబు జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారన్నారు.

దయ్యాల గుంపులాగా టీడీపీ మారిందని.. రాజకీయాలు అంటే మంచి పాలనకు సంబంధించి ఉండాలని కోరుకునే వ్యక్తి జగన్ అని చెప్పారు. చంద్రబాబు బాబువి దౌర్భాగ్యపు ఆలోచనలు అని.. నిజం నిప్పులాంటిది కాబట్టే చంద్రబాబు చేతులు కాలాయన్నారు. అబద్ధానికి బట్టలు వేస్తే చంద్రబాబులా ఉంటారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news