టీడీపీ, జనసేన పొత్తు.. అక్రమ సంబంధమే – సజ్జల కీలక వ్యాఖ్యలు !

-

టీడీపీ, జనసేన పొత్తు పై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఉద్దేశంలో లేరని…ప్రజలు ఐదేళ్ళ కాలానికి తీర్పు ఇచ్చారన్నారు.  ప్రతిపక్షాలు తాము సజీవంగా ఉన్నామని చెప్పటానికి ముందస్తు ప్రకటనలు చేస్తున్నారురహస్యంగా ఎందుకు సమావేశాలు అవుతున్నారు?? అని ప్రశ్నించారు. తమ అక్రమ సంబంధాలను సక్రమం అని చెప్పటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

*చంపిన వాళ్ళను పరామర్శించటం ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా??**11 మంది ప్రాణాలు తీసిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ పరామర్శించటం దారుణమని ఆగ్రహించారు సజ్జల. చనిపోయిన కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శించ లేదు..జనసేన, టీడీపీ కలవటాన్ని వామపక్షాలు స్వాగతించటం విచిత్రంగా ఉందన్నారు.

 

బీజేపీ కూడా కలిస్తే వామపక్షాలు ఏ వైఖరి తీసుకుంటాయో..ఎరుపు, కాషాయం కలిసి పసుపు అవుతుందేమో అంటూ చురకలు అంటించారు. ఎంత మందిని కలిసినా మంచిదే..*పంది కొక్కులు, ఎలుకలు, అన్నీ కలిస్తే ఎవరి విలువలు ఏంటో మరోసారి బయటపడుతుందన్నారు. అందరినీ కలిసి ఒకేసారి ఓడించే అవకాశం కూడా జగన్ కు వస్తుందన్నారు సజ్జల.

 

Read more RELATED
Recommended to you

Latest news