భవిష్యత్తు చిత్ర పటాన్ని ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది : సజ్జల

-

ఏపీలో వైసీపీ ప్లీనరీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్లీనరీలో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వైసీపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో ఏర్పాటు చేసిన వైసీపీ ప్లీనరీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ళ కిందట చారిత్రాత్మక ప్లీనరీని ఇదే ప్రాంతంలో నిర్వహించామన్నారు. భవిష్యత్తు చిత్ర పటాన్ని ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతుందని, ఇది కేవలం పార్టీకి సంబంధించిన ప్లీనరీ మాత్రమే కాదన్నారు.

Sajjala Ramakrishna Reddy rules out early elections in Andhra Pradesh

ప్రజల ఎజెండాతో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే అంశం పై సమగ్ర చర్చ ఉంటుందని, వార్డు స్థాయిలో పోటీ చేసిన వ్యక్తికి సైతం సీఎం జగన్ స్వయంగా చేసిన సంతకంతో ఆహ్వాన లేఖను అందిస్తున్నామన్నారు. ఇది కూడా ఒక ఆహ్వానంగా అందరూ భావించి పెద్ద ఎత్తున తరలిరండని, మీడియా కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని విగ్నప్తి చేస్తున్నామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news