అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన సమంత !

-

సమంత తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తనకి ప్రాణాంతకమైన “MYOSITIS” అనే వ్యాధి ఉన్నట్లు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు ఫోటోని షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమంత కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యాధితో కండరాలు వాపుకు గురవుతాయని, గాయాలైన, ఇన్ఫెక్షన్లు వచ్చినా రోగ నిరోధక శక్తి క్షీణించిన ఈ వ్యాధి వస్తుంది అని వైద్యులు చెబుతున్నారు.

దీంతో కండరాలు బలహీన పడతాయని, కొంచెంసేపు నిలబడిననా, నడిచిన అలసిపోతారని.. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడతారని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధితో ఒక్కోసారి అంగవైకల్యం, పరిస్థితి చేయి దాటితే మరణం కూడా సంభవించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు కూడా షాక్ కి గురయ్యారు.

శ్రియ, రాశిఖన్నా, దివ్య స్పందన, డైరెక్టర్ నందిని రెడ్డి, సుస్మిత కొణిదెల, కియారా అద్వానీ తదితరులు ఆమె త్వరగా కోలుకోవాలని పోస్టులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో దృఢంగా ఉండాలని మద్దతుగా నిలుస్తున్నారు. అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని తెగ ట్వీట్లు చేయడంతో #SamanthaRuthprabhu అనే హ్యాష్ ట్యాగ్ ట్విటర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news