CM KCR : జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ కెసిఆర్ సైకత శిల్పం

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేశారు. కేసీఆర్‌ ఆలోచన మేరకు జాతీయ పార్టీగా పేరు మార్పిడి ప్రక్రియ దసరా రోజున ప్రారంభమవుతుంది. ఆ రోజు టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఆమోదం తెలపనుంది.

ఇక ఇది ఇలా ఉండగా.. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల ప్రకటన నేపథ్యంలోనే.. ఆయన జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ.. జగన్నాథుడు టీఆర్‌ఎస్‌ నేత అలిశెట్టి అరవింద్‌.. సైకత శిల్పి సాహు చేత శిల్పాన్ని రూపొందించారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాటం.. చేసి.. రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నేత కేసీఆర్‌ అని.. ఇప్పుడు దేశాన్ని మార్చేందుకు వస్తున్నారనే నేపథ్యంలోనే.. శిల్పాన్ని రూపొందించామని తెలిపారు అలిశెట్టి అరవింద్‌.

Read more RELATED
Recommended to you

Latest news