Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ హంగామా షురూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా కోసం మహేశ్ – కృష్ణ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 12న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ పైన ఫోకస్ పెట్టేశారు.

ఇప్పటికే దర్శకులు పరశురామ్, హీరోయిన్ కీర్తి సురేశ్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. త్వరలో సూపర్ స్టార్ మహేశ్ కూడా పాల్గొనబోతున్నారని టాక్. కాగా, తాజాగా మేకర్స్ మరో అప్ డేట్ ఇచ్చేశారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక అనౌన్స్ చేశారు. తెలంగాణలోని హైదరాబాద్ యూసుఫ్ గౌడ పోలీస్ గ్రౌండ్స్ ను ప్రీ రిలీజ్ ఈ వెంట్ కు వేదికగా ఫైనల్ చేసినట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

మహేశ్ బాబు కు జోడీగా ఈ సినిమాలో హీరోయిన్ గా ‘మహానటి’ కీర్తి సురేశ్ నటించింది. ‘గీతా గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. సముద్రఖని, నదియా, వెన్నెల కిషోర్ తదితరులు నటించిన ఈ సినిమాలో మహేశ్ బాబు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు.

https://www.instagram.com/p/CdKeXFzosCP/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news