రెండు రోజుల్లో గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్ష: కాంగ్రెస్

-

తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన మలుపులు తీసుకుంటున్నాయి.. ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో BRS పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం పోతోంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలపడుతున్న కాంగ్రెస్ నుండి BRS కు సరైన పోటీ ఉండనుంది. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ నేత మల్లు రవి మరో రెండు రోజుల్లో అంటే.. జులై 12వ తేదీన గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్షను చేపట్టనున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని రాజకీయంగా దెబ్బ తీయడానికి బీజేపీ ప్రయత్నాలను చేస్తోందని మల్లు రవి ఫైర్ అయ్యారు. ఈ కుట్రలకు నిరసనగా గాంధీ భావం లో ఈ దీక్షను చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు మల్లు రవి. కాగా ఈ మధ్యనే ఖమ్మం జిల్లా నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో మరింత బలంగా మారింది అని చెప్పాలి.

ఈ దీక్షకు రాష్ట్రము నుండి నేతలు వచ్చి పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా ఈ దీక్షకు కాంగ్రెస్ నాయకులూ ఎంతమంది హాజరు అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version