విద్యార్థులకు అలర్ట్..ఇవాళ్టి నుంచే విద్యాసంస్థలు పునః ప్రారంభం

-

ఏపీ అలాగే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ్టి నుంచి స్కూళ్లు, విద్యాసంస్థలు అన్నియూ పునః ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం, అటు ఏపీలోనూ ఇవాళ్టి నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. స్కూల్లు, కాలేజీలకు నిన్నటితో దసరా సెలవులు ముగిశాయి.

స్కూళ్లకు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 9 వ తేదీ వరకు, జూనియర్ కాలేజీలకు అక్టోబర్ రెండు నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. సెలవులు ముగియడంతో అన్ని రకాల స్కూల్లు, కాలేజీలు ఇవాళ పునః ప్రారంభం కానున్నాయి.

ఇక ఇవాళ్టి నుంచే పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలోనే.. పిల్లల పేరేంట్స్‌ కు మేసేజ్లు చేసి.. గుర్తు చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఎప్పటి లాగా… హాజరు శాతం పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news