బ్రేకింగ్‌ : ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు న‌మోదు

-

ఆంధ్ర ప్ర‌దేవ్ రాష్ట్రంలో రెండో ఒమిక్రాన్ కేసు న‌మోదు అయింది. కెన్యా నుంచి తిరుప‌తి కి వ‌చ్చిన మ‌హిళ‌కు ఒమిక్రాన్ నిర్ధార‌ణ అయిన‌ట్లు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 39 ఏళ్ల స‌ద‌రు మ‌హిళ ఈ నెల 12 వ తేదీన కెన్యా నుంచి చెన్నై కి వ‌చ్చింది. అక్క‌డి నుంచి తిరుప‌తి చేరుకున్న ఆ మ‌హిళ న‌మూనాల‌ను సేక‌రించి.. జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు.

ap carona
ap carona

అయితే.. ఈ ప‌రీక్ష‌లలో ఆమె కు ఒమిక్కాన్ పాజిటివ్ గా వ‌చ్చిన‌ట్లు తాజాగా నిర్ధార‌ణ అయింది. అయితే.. ఆ మ‌హిళ కుటుంబ స‌భ్యుల‌కు మాత్రం ఒమిక్రాన్ నెగిటివ్ వ‌చ్చిన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. ఇక ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇప్ప‌టికే తొలి కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. విజ‌య‌న‌గ‌రం జిల్లా లో తొలి కేసు న‌మోదు అయింది. ఇక అటు ఏపీలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం శుభ‌సూచకం.

Read more RELATED
Recommended to you

Latest news