ప్రముఖ సీనియర్ హీరోయిన్ జయసుధ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె సహజనటిగా గుర్తింపు తెచ్చుకొని సుమారుగా తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాలలో..కొన్ని పదుల సంఖ్యలో సినిమాలలో నటించి మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది . 50 సంవత్సరాలు సినీ జీవితాన్ని ఇటీవల పూర్తి చేస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల పై వివక్షత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు జయసుధ . అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీకి, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి గల తారతమ్యాన్ని కూడా ఆమె వెల్లడించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఇతర భాష హీరోయిన్లతో పోల్చుకుంటే తెలుగు హీరోయిన్ల పై ఎప్పటికీ చిన్న చూపే ఉందంటున్నారు. అదే సమయంలో పద్మశ్రీ లాంటి అవార్డులకు మేము పనికి రామా అంటూ ఆమె ఘాటుగా స్పందించడం జరిగింది. ఇకపోతే ఇటీవల కంగనా రనౌత్ కిపద్మశ్రీ పురస్కారం ఇచ్చిన నేపథ్యంలో ఆమె ప్రభుత్వానికి ఏం అవసరం ఉందో అంటూ సంచలనాలకు తెరలేపింది జయసుధ. ఇక ఎప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లను తొక్కేస్తున్నారు అంటూ జయసుధ బాధపడడం జరిగింది.