ఏపీలో దారుణం….పోలీసునంటూ బెదిరించి… ఇద్దరు బాలికలపై అత్యాచారం

-

ఒంటరిగా ఉన్న బాలికలపై, మహిళలపై కామాంధులు కన్నెస్తున్నారు. వారి జీవితాలను చిదిమేస్తున్నారు. ప్రభుత్వం దిశ, నిర్భయ, పోక్సో వంటి చట్టాలు తీసుకువచ్చినా.. మానవ మృగాలు కామ వాంఛతో దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా ఆడది కనిపిస్తే దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా కురపాంలో కూడా ఓ దుర్మార్గుడు ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా కురుపాం లో ఓ వక్యి తాను పోలీసునంటూ… ఇద్దరు ఇంటర్ విద్యార్థినులను భయపెట్టి అత్యాచారానికి ఒడిగట్టాడు. న్యూ ఇయర్ సందర్భంగా స్థానికంగా గిరిజన హాస్టల్ లో ఉండే ఇద్దరు ఇంటర్ విద్యార్థినిలు జియ్యమ్మ వలస మండలం రేగడి వద్దకు సరదాగా విహారయాత్రకు వెళ్లారు. అక్కడి నుంచి వస్తున్న క్రమంలో ఒంటరిగా ఉన్న విద్యార్థినిలను చూసిన రాంబాబు అనే వ్యక్తి మార్గం మధ్యలో బాలికను ఆపి తాను పోలీసునంటూ.. ఇద్దరు బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అత్యాచారానికి గురైన ఇద్దరు బాలికలు తమను జరిగిన అన్యాయాన్ని హాస్టల్ అధికారికి తెలియజేశారు. దీంతో సదరు హాస్టల్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా సరదాగా బయటకు వెళ్లిన బాలికల పట్ల అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రాంబాబుకు నేర చరిత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news