100 రోజుల తర్వాత మంత్రి కేటీఆర్ ఎక్కడ ఉంటారో చూసుకోవాలి : షబ్బీర్‌ అలీ

-

మంత్రి కేటీఆర్ ఖబడ్దార్ అంటూ మాజీ మంత్రి షబ్బీర్ అలీ వార్నింగ్ ఇచ్చారు. నేడు గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌ని ప్రజలు తరిమి తరిమి కొట్టకపోతే తన పేరు మార్చుకుంటానన్నారు. మంత్రి కేటీఆర్ కామారెడ్డిలో చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 100వ రోజు తర్వాత మంత్రి కేటీఆర్ ఎక్కడ ఉంటారో చూసుకోవాలని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు.

త్వరలో మంత్రి కేటీఆర్‌కు తగగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కామారెడ్డి షబ్బీర్ అలీ ఏం పీకారని మంత్రి కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అమెరికాలో ఉన్న కేటీఆర్‌కు ఇక్కడ ఏం జరిగిందో ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. తాను కామారెడ్డిలో ఏం చేశాననేది ఇప్పటికే అసెంబ్లీ ముఖ్యమంత్రి కేసీఆరే చెప్పారని షబ్బీర్ అలీ తెలిపారు.

సీఎం కేసీఆర్ కామారెడ్డి‌లో పోటీ చేస్తే.. తానూ అక్కడే పోటీ చేస్తానని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. కేసీఆర్‌కు రాజకీయంగా జన్మినచ్చింది కాంగ్రెసేనని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను తరిమి కొట్టకపోతే తన పేరు మార్చుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు కేసీఆర్‌కు ఇల్లు కూడా లేదని.. కానీ ఇప్పుడు వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ నిర్మిస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం లీజుకిచ్చి డబ్బులు సంపాదించుకుంటోందని షబ్బీర్ అలీ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version