వానపాములా పడుకుంటే.. త్రాచుపాములా కాటేస్తున్నాడు : కేసీఆర్‌ పై షర్మిల సంచలనం

-

వానపాములా పడకుంటే.. త్రాచు పాములా సీఎం కేసీఆర్‌ కాటేస్తున్నాడని వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. G.O.317-సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య పంచాయితీ పెట్టిందని ఫైర్‌ అయ్యారు వైఎస్‌ షర్మిల. భార్యా భర్తలను విడదీసిందని… .9 మందికి పైగా ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకొందని సీఎం కేసీఆర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయినా దొర పట్టిన కుందేలు కు మూడే కా ళ్లన్నట్టు ఉందని.. G.O.ను మాత్రం రద్దు చేయడం లేదని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. ఉద్యోగుల సమస్యలను తీరుస్తారని చందాలు వేసి గెలిపిం చుకొన్న ఉద్యోగ సంఘాలు… పాలు పోసి పెంచిన పాము లాగా ఉద్యోగులనే కాటేస్తుంటే, అధికారం ముందు వానపాములై పడుకొంటే చావే శరణ్యం అయింది ఉద్యోగులకు అంటూ మండిపడ్డారు వైఎస్‌ షర్మిల. దొరగారి పోకడలకు ఉద్యోగులు సైతం బంగారు తెలంగాణలో చావుబాట పడుతున్నారని… ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వ లేని చేతకాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనకొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news