టిఆర్ఎస్ ప్రభుత్యం..దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం – షర్మిల

-

టిఆర్ఎస్ ప్రభుత్యం..దోపిడి రాజ్యం,దొంగల రాజ్యం అని వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. రాజశేఖర్ రెడ్డి హయాంలోపొడు భూములకు హక్కు కల్పిస్తే.. ఈ పాలనలో పొడు సాగు భూములను లాగేసుకున్నారని ఫైర్ అయ్యారు. ఖమ్మం జిల్లాలో 21 మందిని జైల్లో పెట్టారు..మహిళలను చూడకుండా చంటి బిడ్డల తల్లులనే కనికరం చూడకుండా సంకెళ్లు వేశారని వెల్లడించారు.

బ్రతిమిలాడిన మంచినీళ్లు ఇవ్వకుండా పోలీసులు జైల్లో వేధించారన్నారు. సీఎం కెసిఆర్ స్వలాభం కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారనీ మండి పడ్డారు.కెసిఆర్ కుటుంబం తప్ప ఎవరు బాధ పడలేదు… నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కెసిఆర్ కు చలనం లేదన్నారు.ఇది ప్రజాస్వామ్యం ప్రజా ప్రభుత్వం కాదు, ఇది గుండాల రాజ్యం, దోపిడి రాజ్యం,దొంగల రాజ్యం ఆని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version