తొలి లైన్ ఉమ‌న్‌గా రికార్డ్ సృష్టించిన శిరీష

-

స్త్రీలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు. తెలంగాణలో ఓ యువతి అరుదైన రికార్డ్ ను సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించింది. పురుషులే ఎంతో కష్టంగా చేసే లైన్ మెన్ జాబ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో తెలంగాణ‌లో తొలి లైన్ ఉమ‌న్‌గా శిరీష అనే యువ‌తి రికార్డులకెక్కింది. తెలంగాణ రాష్ట్ర ద‌క్షిణ ప్రాంత విద్యు‌త్ స‌ర‌ఫ‌రా సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్‌) ఇటీవ‌లే లైన్ మ‌న్ల ఎంపిక చేప‌ట్ట‌గా… లైన్ ఉమ‌న్ ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు చేసుకుంది శిరీష‌.

అన్ని అర్హ‌త ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త సాధించింది శిరీష. దీని ఫ‌లితంగా లైన్ ఉమ‌న్‌గా ఆమె ఎంపికైంది. దీంతో బుధ‌వారం ఆమె లైన్ ఉమ‌న్‌గా ఉద్యోగ నియామ‌క ప‌త్రాన్ని అందుకుంది. సదరు నియామ‌క ప‌త్రాన్ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఆమెకు అంద‌జేశారు. అంతేకాకుండా.. స్త్రీలు తలుచుకుంటే.. ఏదైనా సాధించగలరని నమ్మకాన్ని శిరీష మరోసారి రుజువు అభినందనలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news