ఇండియాలో భారీగా పెరిగిన స్మార్ట్ ఫోన్ యూజర్లు

-

దేశంలో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత నాలుగేళ్లలో స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య 40 శాతం పెరిగినట్లు ఒక సర్వేలో వెల్లడైంది. కరోనా పాండమిక్ లాక్ డౌన్ల వల్ల ఇంటర్నెట్ వాడకం గణనీయంగా పెరిగింది. మరోవైపు ఆన్ లైన్ క్లాసుల మూలంగా ప్రస్తుతం విద్యార్ధులకు స్మార్ట్ ఫోన్ల అనివార్యత పెరిగింది. ప్రస్తుతం దేశంలో సుమారు 130 కోట్ల మంది జనాభా ఉంటే 2021 నాటికి దాంట్లో దాదాపు 47 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకందారులు, ఇంటర్నెట్ వాడుతున్న వారిపై లెర్నింగ్ ఇనిషియేట్స్ ఇన్‌ రీఫామ్స్ ఫర్ నెట్‌వర్క్ ఏకనామిస్ ఏసియా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఇందులో భాగంగా 7వేల మంది నుంచి వివరాలు సేకరించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఒక్క 2020-21 ఏడాదిలో 13.2 కోట్ల మంది ఆన్‌లైన్‌లోకి వచ్చినట్లు స్పష్టమైంది. ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిలో 57 శాతం మంది పురుషులు ఉండగా.. 36 శాతం మంది మహిళలు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం 55 శాతం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 44 శాతానికి పరిమితమైంది

ముఖ్యంగా 15-25 ఏళ్ల మధ్య వయసు వారు నెట్ ఎక్కువగా వాడుతున్నారని సర్వే తెలిపింది. 15 ఏళ్లకు పైబడిన వారిలో ఇంటర్నెట్ వాడుతున్న వారు 2019లో 19 శాతం మాత్రమే ఉండగా… 2021 నాటికి 47 శాతానికి పెరిగింది. దేశంలో ఇంటర్నెట్ వాడుతున్న వారిలో ఢిల్లీలో 72 శాతం మంది ఉండగా… మహారాష్ట్రలో 55 శాతం మంది, తమిళనాడులో 53 శాతం మంది, అసోంలో 37 శాతం మంది ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news