మహారాష్ట్రలో నీటికోసం ఇక్కట్లు.. తెలంగాణలో కోటికి పైగా ఇళ్లకు స్వచ్ఛమైన నీరు : సీఎంఓ అధికారిణి స్మితా సబర్వాల్

-

https://twitter.com/SmitaSabharwal/status/1662288969923702784?s=20

తెలంగాణ సీఎంఓ అధికారిణిగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కాసేపటి క్రితమే ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో స్మితా సబర్వాల్ ప్రజలు తాగు నీటి కోసం ఎంత ఇబ్బందులు పడుతున్నారు అన్న అంశం గురించి ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. గతంలో ఈమె పనిచేసిన జిల్లాలో ఏ విధంగా నీటి కోసం ఇబ్బందులు పడ్డారు… ఇప్పుడు ఆ జిల్లా ఆ రాష్ట్రము ఎంతగా అభివృద్ధి చెందింది అన్నది వివరించడానికి ప్రయత్నం చేశారు. కరీంనగర్ జిల్లాలో పది సంవత్సరాల క్రితం నీటి కోసం రోడ్లపైన ధర్నాచేసే పరిస్థితి, కానీ ఇప్పుడు చూస్తే తెలంగాణ ప్రభుత్వం కోటి ఇళ్లకు పైగానే స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తోంది.

కానీ ఇప్పుడు మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాను తీసుకుంటే అక్కడ ప్రజలు ఇంకా నీటి కోసం బావులలో ప్రమాదకరమైన పరిస్థితిలో నీటిని తీసుకుంటున్నారు. ఇంతటి టెక్నాలజీ డెవలప్ అయిన కాలంలోనూ ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే బాధాకరం అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news