సీఎం కేసీఆర్ ఓ కుంభకర్ణుడు – షర్మిల

-

ఎన్నికలు వచ్చేశాయ్.. కుంభకర్ణుడు నిద్రలేచాడని సీఎం కేసీఆర్‌ పై వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. జిమ్మిక్కులు బయటపెడుతున్నాడు! ఓట్ల కోసం కొత్త, పాత పథకాలకు తెరలేపుతున్నాడు! ఇండ్లకు పైసలిస్తాడట.. పోడు పట్టాలిస్తాడట.. బీసీలకు ఆర్థికసాయం చేస్తాడట అంటూ చురకలు అంటించారు. దొర చెప్పేది బారాణా అయితే ఇచ్చేది చారాణా మందం కూడా ఉండదు. 13 లక్షల డబుల్ బెడ్ రూం దరఖాస్తులకు 30 వేలు కూడా ఇయ్యలేనోడు.. ఎన్నికలు వచ్చే సరికి నియోజకవర్గానికి 3 వేల మందికి మూడు లక్షల చొప్పున ఇస్తాడని పేర్కొన్నారు.

గతంలో 15 రోజుల్లోనే మూడు లక్షలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ దొర, ఇప్పుడు ముందు రూ.లక్ష, ఎన్నికల్లో గెలిస్తే రూ.లక్ష అంటూ తిరకాసు పెడుతున్నాడు. ఇండ్ల పేరుతో 30 లక్షల కుటుంబాలను దగా చేసే పనిలో పడ్డాడు. గెలిచిన 9 ఏళ్లలో ఒక్క ఎకరాకు పోడు పట్టా ఇయ్యని కేసీఆర్.. ఎన్నికల ముందు పోడు పట్టాలు ముందటేసుకుండు. పోడు భూములు 13.18 లక్షల ఎకరాలు ఉంటే 4.01లక్షల ఎకరాలకే పట్టాలు ఇచ్చి, చేతులు దులుపుకొని, ఓట్లు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ముందు కొన్ని ఇచ్చి, మిగతావి ఎన్నికల తర్వాత ఇస్తానని మభ్య పెట్టడానికా? అని పేర్కొన్నారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news