జనసేనతో మా పొత్తు కొనసాగుతుంది – సోము వీర్రాజు

-

వచ్చే ఎన్నికలు.. అలాగే ఎన్నికల పొత్తులపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని ప్రకటనించారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇవాళ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.

జనసేనతో దూరంగా ఉన్నామనే ప్రచారం నిజం కాదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. జనసేన, జనంతో మాత్రమే మేం పొత్తు పెట్టుకుంటామన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.విశాఖలో పవన్‌కల్యాణ్‌ను నిర్బంధించారని.. ఆయన నిర్వహించాల్సిన ‘జనవాణి’ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు సరికాదన్నారు. రోడ్‌ మ్యాప్‌ ఇవ్వాలని పవన్‌ అడుగుతున్నారని.. ఆ విషయం తమ పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news