టిటిడి బోర్డులో బీజేపీ జోక్యం చేసుకుంటుంది – సోము వీర్రాజు

-

టిటిడి బోర్డులో బీజేపీ జోక్యం చేసుకుంటుందని బీజీపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఎమ్మెల్యే అనుచరుడి వీరంగం వేసిన ఘటనలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు సోము వీర్రాజు. తిరుమలలో గది కావాలంటూ దబాయింపు చేసిన వ్యవహారంలో టీటీడీ ఛైర్మన్ నోరు మెదపాలని.. అడ్డ దారిలో అనుమతించాలని టీటీడీ ఉద్యోగితో వాగ్వివాదం చేసిన వవ్యవహారాన్ని టీటీడీ బోర్డు సీరియస్ గా తీసుకోవాలని హెచ్చరించారు.


అనుమతించక పోవడంతో టీటీడీ సీనియర్ అసిస్టెంట్ వెంకట రత్నం పై దాడి చేసిన ఘటన పై బోర్డు పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్‌ చేశారు. తీవ్రగాయలతో పిర్యాదు చేసిన వెంకట రత్నంకు టిటిడి బోర్డు అండగా ఉండక పోతే బీజేపీ జోక్యం చేసుకుంటుందని హెచ్చరించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వెంకట రత్నంకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.ఎమ్మెల్యేల అనుచరులు ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు సోము వీర్రాజు.

Read more RELATED
Recommended to you

Latest news