మరింత పటిష్టంగా ప్రణాళికలు :సోము వీర్రాజు

-

సంస్థాగత పటిష్టం దిశగా బీజేపీ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు 4 చోట్ల జోనల్ సమావేశాలు జరుగనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వెల్లడించారు. మంగళవారం అమరావతిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఏపీ బీజేపీ సంస్థాగతంగా మరింత పటిష్టానికి ప్రణాళికా బద్దంగా అడుగులు వేస్తోందని, ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడానికి పోలింగ్ బూత్ స్థాయి కమిటీలను పటిష్ట పరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

TDP, YSRC governments failed to develop AP, says Somu Veerraju

ఇప్పటికే 70 శాతం మేర బూత్ కమిటీలు వేసినట్లు, పోలింగ్ బూత్ కేంద్రంగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే పార్టీ శ్రేణులను ఆదేశించామన్నారు. ఈ క్రమంలోనే రేపు విశాఖలో జోనల్ సమావేశం, ఈ నెల 28న రాజమండ్రిలో గోదావరి జోన్ సమావేశం, గుంటూరులో 29న జరుపనున్న కోస్టల్ జోన్ సమావేశంతోపాటు చివరగా ఈ నెల 30న అనంతపురంలో రాయలసీమ జోన్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news