టీం ఇండియాను అవమానించిన ఆసీస్ క్రికెటర్లు !

-

ఇటీవల ముగిసిన వన్ డే వరల్డ్ కప్ లో తుది పోరుకు చేరుకున్న ఇండియా మరియు ఆస్ట్రేలియాలు, చివరికి ట్రోఫీ ని గెలుచుకున్నది మాత్రం కమిన్స్ నేతృత్వంలోని జట్టు. ఈ మ్యాచ్ లో ఇండియా చాలా దారుణమైన ప్రదర్శన చేసింది అని చెప్పాలి. తాజాగా ఈ విజయం ను ఉద్దేశిస్తూ ఆస్ట్రేలియా కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇండియన్స్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ పోస్ట్ లో ఇండియన్ క్రికెటర్ లను అవమానించేలా చాలా అభ్యంతరకరంగా ఉండడంతో అందరూ ఆస్ట్రేలియా ను కామెంట్ చేస్తున్నారు. “సౌత్ ఆస్ట్రేలియా మాన్ గివ్స్ బర్త్ టు వరల్డ్ రికార్డు 11 సన్స్” అని క్యాప్షన్ పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.

ఇందులో ట్రావిస్ హెడ్ ను తల్లిలా చూపిస్తూ.. పిల్లలకు మన క్రికెటర్ ల ఫోటోలను తగిలించి మార్ఫింగ్ చేశారు. ఈ పోస్ట్ కు కమిన్స్, మాక్స్ వెల్ మరియు పించ్ లాంటి ప్లేయర్స్ లైక్ కొట్టారు. ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియాలో ఫైర్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version