ఐపీఎల్ 2023: ముంబైపై “లివింగ్ స్టన్” అర్ద సెంచరీ !

-

ఈ రోజు డబుల్ ధమాకాలో భాగంగా ముంబై ఇండియన్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్యన మొహాలీలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచినా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ సాలిడ్ గానే ఆడుతోంది. ముంబై లాంటి బలమైన జట్టు ముందు భారీ లక్ష్యాన్ని పెట్టడానికి చమటోడుస్తోంది. కాగా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లియాన్ లివింగ్ స్టన్ తన ఫామ్ ను దొరకబుచ్చుకున్నాడు. గత మ్యాచ్ లలో పేలవమైన ఆటతీరుతో ఫ్యాన్స్ ను విసిగించిన ఇతను ఈ మ్యాచ్ లో మాత్రం చాల కంట్రోల్ గా ఆడుతూ ఇన్నింగ్స్ ను ఒక భారీ స్కోర్ దిశగా తీసుకువెళ్తున్నాడు.

సెకండ్ డౌన్ గా క్రీజులోకి వచ్చిన లివింగ్స్టన్ ఆచితూచి ఆడుతూ ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం క్రీజులో లివింగ్స్టన్ మరియు జితేష్ శర్మలు స్టాండర్డ్ అయి ఉన్నారు. ఈ దశలో లివింగ్స్టన్ 32 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సుతో అర్ద సెంచరీని (53) పూర్తి చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version