ముంబై జట్టులో కీలక మార్పులు.. ఉనద్కట్ ను తప్పించి అర్జున్ టెండూల్కర్ కి అవకాశం

-

ఐపీఎల్ 2022 లో నేడు 44వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగనుంది.అయితే ముంబై ఆడిన 8 మ్యాచ్ లలో 8 ఓడిపోవడంతో నేటి మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.ముఖ్యంగా ముంబై టాప్ ఆర్డర్ బ్యాటర్లు నిరాశపరుచుతున్నారు.దీంతో ముంబై ఇండియన్స్ జట్టులో కీలక మార్పులు తథ్యమని తెలుస్తోంది.జయదేవ్ ఉనద్కట్ ను తప్పిస్తారని తెలుస్తోంది.అతడి స్థానంలో క్రికెట్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మెంటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ రావచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అతను ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో సోషల్ మీడియాలో ముంబై పై ట్రోలింగ్ పెరిగింది.దీంతో అతన్ని తుది జట్టులోకి తీసుకునే వీలుంది.అలాగే టీం డేవిడ్, ఫాభియన్ అలెన్, లాంటి విదేశీ ప్లేయర్లను తీసుకునేందుకు డేవాల్ట్ బ్రెవీస్ , కీరణ్ పోలార్డ్ లను తొలగించే అవకాశం ఉంది.అయితే పొలార్డ్ ను ముంబై తప్పిస్తుందా అనేది సందిగ్ధమే.ఇక రాజస్థాన్ రాయల్స్ సక్సెస్ఫుల్ టీం గా కొనసాగుతుండడంతో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news