సంజూ సాంసన్ కి కోహ్లీ ఇచ్చిన సలహా..

-

ఐపీఎల్ 13వ సీజన్లో రాజస్థాన రాయల్స్ తరపున ఆడుతున్న సంజూ సాంసన్ తనదైన అద్భుత పర్ ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. వరుసగా అర్థ సెంచరీలు చేస్తూ అందరి దృష్టిలో పడ్డాడు. కేరళకి చెందిన సంజూ సాంసన్, 2014లో జరిగిన ట్వంట్వీ ట్వంటీ ద్వారా ఇండియా తరపున అరంగేట్రం చేసాడు. ఆ మ్యాచులో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత సంజూ సాంసన్ ఇండియా తరపున ఆడడానికి చాలా రోజులు పట్టింది.

ఐతే ఇండియా తరపున ఆడుతున్నప్పుడు సీనియర్లు అయిన కోహ్లీ, ఇతర క్రికెటర్లు తనకి ఎన్నో సలహాలు ఇచ్చారని చెబుతున్నాడు. వాటిల్లో తనకి బాగా నచ్చిన ఒకానొక విషయాన్ని బయటపెట్టాడు. జిమ్ లో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో కోహ్లీ తనని ఎన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడాలని అనుకుంటున్నావు అని అడిగాడట. అప్పుడు మరో పదేళ్ళు ఆడతానని చెప్పాడట. దానికి కోహ్లీ, పదేళ్ల దాకా క్రికెట్టే జీవితం. అప్పటి వరకూ క్రికెటర్ గా కొనసాగడానికి కావాల్సినవన్నీ చెయ్. నీకు నచ్చిన ఫుడ్ కూడా పదేళ్ళ తర్వాతే తిను అని చెప్పాడట.

క్రికెట్ కి ఫిట్ నెస్ ఎంత ముఖ్యమో చెప్పాల్సిన పనిలేదు. భారత ఆటగాళ్ళలో కోహ్లీ ఎంత ఫిట్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. క్రికెట్ మీద ఉన్న ఆసక్తి అతన్ని ఇంకా పరుగులు పెట్టిస్తూనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news