IND vs ENG: సహనం కోల్పోయి ఫీల్డర్ ను బూతులు తిట్టిన రోహిత్ శర్మ!

-

శనివారం ఇంగ్లాండ్ తో జరిగిన రెండో t-20లో ఫీల్డర్ తప్పిదానికి ఆగ్రహానికి గురయ్యాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టి-20లో నాలుగోవ ఓవర్ అనంతరం రోహిత్ శర్మ ఫీల్డర్ కు తన పొజిషన్ గురించి చెబుతున్నాడు. అయితే రోహిత్ శర్మ మాటలను సదరు ఫిల్డర్ పట్టించుకోలేదు. దాంతో చిర్రేత్తుకుపోయిన హిట్ మాన్ నోటికి పని చెప్పాడు.

“నేను మాట్లాడేటప్పుడు నన్నే చూడాలి” అంటూ హిందీలో తిట్టాడు. ఇవి కాస్త స్టంప్ మైక్ లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో పై స్పందించిన నెటిజన్లు రోహిత్ శర్మ ప్రశాంతంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన భారత జట్టు 49 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో రోహిత్ సేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news