టీమ్​ ఇండియాకు గుడ్​ న్యూస్​.. వరల్డ్​ కప్​ జట్టులో ఆ బౌలర్లు

-

ఆసియా కప్ ముగిసింది. టి20 ప్రపంచ కప్ మహాసంగ్రామానికి కౌంట్ డౌన్ షురూ అయింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా ఆరంభం కానున్న టి20 ప్రపంచ కప్ కోసం అన్ని జట్లు తమ సన్నాహకాలను ఇప్పటికే మొదలుపెట్టాయి. భారత్ ఈ నెల 16 లోపు జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బౌలర్ల వల్ల టీం ప్రకటనపై జాప్యం జరుగుతుందని సమాచారం.

జస్ప్రిత్ బూమ్రా, హర్షల్ పటేల్ లు గాయాలతో ఆసియా కప్ కు దూరమైన సంగతి తెలిసిందే. బూమ్రా వెన్ను నొప్పితో బాధపడుతుంటే, హర్షల్ పటేల్ పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో పాల్గొంటున్నారు. తాజాగా నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో వీరిద్దరూ పాస్ అయినట్లు వార్తలు అందుతున్నాయి. అన్ని సవ్యంగా జరిగితే ఆస్ట్రేలియాతో ఈనెల 24 సిరీస్ కు బూమ్రా, హర్షల్ పటేల్ లు అందుబాటులో ఉండటం ఖాయంగా కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news