BREAKING : మహిళా క్రికెటర్ అనుమానాస్పద మృతి

-

క్రీడా రంగంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఒడిశాలో ఓ యువ మహిళా క్రికెటర్ అడవిలో శవమై కనిపించింది. కటక్ జిల్లాలో రాజశ్రీ స్వైన్ అనే మహిళ క్రికెటర్ కనిపించలేదని ఆమె కోచ్ బుధవారం మంగళబాగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు ఆమె కోసం వెతకగా, శుక్రవారం ఉదయం ఆతాగడ్ అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతున్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు హత్యగా భావించి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news