ధోని వాటర్ తాగుతున్న కోహ్లీ..ఫోటో వైరల్

-

మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేకంగా పరిచయం అక్కర లేని పేరు. బహుశా ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సచిన్ టెండూల్కర్ తరువాత అంతటి పేరు సంపాదించిన వ్యక్తి ఎంఎస్ ధోనీనే. ఇండియన్ క్రికెట్ లో విజయవంతమైన కెప్టెన్ గా, ఆటగాడిగా మిస్టర్ కూల్ పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా స్టార్ కింగ్ విరాట్ కోహ్లీ ధోని పై తనకున్న ప్రేమను మరోసారి నిరూపించుకున్నాడు.

ధోని ఫోటోను ఓ వాటర్ బాటిల్ సంస్థ తమ బాటిళ్ల పై ముద్రించింది. దాంతో ఈ బాటిల్ పై ఉన్న ధోని పిక్ ను తన ఇన్స్టా గ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు కోహ్లీ. పైగా అతడు అన్ని చోట్ల ఉంటాడు. కేవలం వాటర్ అనే కాదు భూమి, ఆకాశం ఇలా అన్ని చోట్ల ఉంటాడని, అతడి క్రేజ్ ఎవరికీ సాధ్యం కాదు అని విరాట్ పేర్కొన్నాడు. ప్రస్తుతం విరాట్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ధోని రిటైర్ అయ్యి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నా గాని విరాట్ మాత్రం అతనిపై తనకున్న అభిమానాన్ని పలు విధాలుగా చాటుతూనే ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news