ఒలింపిక్స్ : రెజ్లింగ్ నుండి మరో శుభవార్త..!

-

ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ 2024లో భారత ప్రయాణం ముగింపుకు చేరుకుంది. భారత్ కు నిన్న రాత్రి రెజ్లింగ్ లో అమన్ శరావత్ 6వ మెడల్ ను అందించగా.. ఇప్పుడు మహిళల 76 కిలోల కేటగిరిలో భారత రెజ్లర్ రితిక క్వాటర్ ఫైనల్స్ కు చేరుకుంది. తాజాగా జరిగిన రౌండ్ 16 మ్యాచ్ లో హంగేరికి చెందిన ప్రత్యర్థిపై సుపీరియారిటీతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థికి రెండు పాయింట్స్ ఇచ్చిన రితిక 12 పాయింట్స్ సాధించి క్వాటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఈ ఒలింపిక్స్ లో భారత్ తరపున ఇద్దరు మహిళా గోల్ఫార్స్ తో పాటుగా రితిక మాత్రమే పోటీలో ఉంది. ఇక క్వాటర్స్ లో కిరిగిస్థాన్ కు చెందిన రెజ్లర్ తో రితిక పోటీ పడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గనుక విజయం సాధిస్తే.. సెమీ ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చే రితిక భారత్ కు మెడల్ తీసుకు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version