తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..నేటి నుంచి వెబ్ సైట్లో టెన్త్ హాల్ టికెట్లు

-

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. నేటి నుంచి వెబ్ సైట్లో టెన్త్ హాల్ టికెట్లు ఉండున్నాయి. ఫీజు బకాయిలు చెల్లించలేదని హాల్‌ టికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్‌ స్కూళ్లు పెట్టే ఇబ్బందుల నుంచి విద్యార్థులను తప్పించేలా పదో తరగతి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు తమ హాల్‌ టికెట్ల ను ఇవాళ్టి నుంచి www.bse.telangana.gov ద్వారా డౌన్‌ లోడ్‌ చేసుకునే వెసులు బాటు కల్పించింది. హాల్‌ టికెట్ల పై హెచ్‌ ఎం సంతకం, స్కూల్‌ స్టాంప్‌ లేకున్నా పరీక్ష రాయొచ్చని విద్యాశాఖ స్పష్టం చేసింది.

పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 23 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. 9.35 గంటల తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. కాబట్టి ప్రతి ఒక్కరూ.. సమయానికి పరీక్షా కేంద్రానికి రావాలని.. విద్యార్థులకు సూచనలు చేసింది విద్యాశాఖ. విద్యార్థులు అందరూ కరోనా నియమ నిబంధనాలు పాటిస్తూ.. రావాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news