బీజేపీ నేతలను తరిమికొట్టకపోతే రాష్ట్రం మరో బీహార్ లా మారుతుంది – మంత్రి గంగుల

-

రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో బిజెపి కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు మంత్రి గంగుల కమలాకర్. కుట్రలు చేస్తున్న బిజెపి నేతలను తరిమికొట్టకపోతే రాష్ట్రం మరో బీహార్ లా మారుతుందని అన్నారు. ఈ కుట్రలకు బండి సంజయ్ నేతృత్వం వహిస్తున్నారని అన్నారు. 9 ఏళ్లలో ఎన్నో పరీక్షలు నిర్వహించాము కానీ ఎప్పుడు పేపర్ లీక్ లాంటి చిన్న సంఘటన జరగలేదని అన్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉండడంతో తెలంగాణపై విషం కక్కే వారి నిజస్వరూపం బయటపడుతుందని అన్నారు.

అశాంతి, అలజడులు రేపి రాష్ట్రాన్ని మరో బీహార్ లాగా చేయాలని బండి సంజయ్ చూస్తున్నారని ఆరోపించారు. లీకుల వ్యవహారం అంతా కరీంనగర్ చుట్టే తిరుగుతుందని, నోటిఫికేషన్ వచ్చి ఉద్యోగాలు వస్తే బిజెపి జండా పట్టుకునే వారు ఉండరని కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మంచి పేరును చెడగొట్టేందుకు బిజెపి అధ్యక్షుడు సంజయ్ అనేక అడ్డదారులు తోక్కుతున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version