చిక్కిపోయి బలహీనంగా ఉన్నారా.. ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి..!!

-

కొంతమంది అధిక బరువుతో బాధపడుతున్నారు. తగ్గడానికి నానా తంటాలు పడుతున్నారు. అయితే ఇంకొంతమంది ఉంటారు.. పాపం ఎప్పుడూ బక్కచిక్కి పోయి ఉంటారు. కడుపునిండానే తింటారు.. కానీ చూసేందుకు మాత్రం చాలా సన్నగా ఉంటారు. సన్నగా ఉంటే పర్లేదు..మరీ వీక్‌గా కనిపిస్తారు.. అదే వారి ప్రాబ్లమ్‌.. దీర్ఘ కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కొంద‌రు బ‌రువును వేగంగా కోల్పోతుంటారు. ఎంత తిన్నా బ‌రువు పెర‌గ‌రు. పైగా చిక్కిపోతూ బ‌ల‌హీనంగా మారుతుంటారు. అయితే అందుకు కార‌ణాలు ఏమున్నా.. కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం ద్వారా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతో బ‌రువు బాగా పెరుగుతారు. దృఢంగా, ఆరోగ్యంగా మారుతారు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే
ఆక‌లి బాగా పెరిగేందుకు, బ‌రువును పెంచేందుకు శొంఠి, అల్లం ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని రోజూ ఆహారంలో తీసుకోవాలి. అల్లం ర‌సం తాగాలి. పాల‌లో శొంఠి క‌లుపుకుని తాగితే బ‌లం క‌లుగుతుంది.రాత్రిపూట వేడి అన్నంలో పాలు పోసి ఆ అన్నంలో తోడుపెట్టి ఉదయాన్నే తినాలి. దీంతో చిక్కిపోతున్నవారు బలం పుంజుకొంటారు. వేడి తగ్గుతుంది. ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, శొంఠి ఈ మూడింటినీ సమానంగా తీసుకొని మెత్తగా దంచి ఆ తోడు అన్నంలో క‌లిపి తింటే తేలిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అలాగే ఒంటికి బ‌లం చేకూరుతుంది.
పిల్లిపీచర వేళ్ళు ఎండించినవి మార్కెట్లో దొరుకుతాయి. వాటిని దంచిన పొడిని టీస్పూన్‌ మోతాదులో తీసుకొని పాలలోవేసి చ‌క్కెర‌ కలిపి తాగుతుండాలి.శిలాజిత్యాదియోగం ఔషధాన్ని రోజూ తీసుకుంటుంటే వివిధ దోషాలు తగ్గుతాయి. రక్త పుష్టి కలుగుతుంది. బ‌లం చేకూరుతుంది. దృఢంగా మారుతారు.బాదం, పిస్తా, జీడిపప్పు, దూలగొండి విత్త‌నాలు, జాజికాయ, జాపత్రి, అశ్వగంధ, నేలగుమ్మడి, పిల్లిపీచర వేళ్ళు, సుగంధిపాలల‌ను సమానంగా తీసుకుని శుభ్రంచేసి మెత్తగా దంచి పొడిచేసి కొద్దిగా పచ్చ కర్పూరం కలిపి సీసాలో భద్రపరచుకోవాలి. ఆ మిశ్ర‌మాన్ని టీస్పూన్ మోతాదులో తీసుకుని పాలలో కలిపి తాగాలి. దీంతో చిక్కిపోతున్న వారు శక్తిమంతుల‌వుతారు. రోజూ రెండు పూటలా ఇలా తాగాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news