మీరు మారరా.. విద్యార్థినుల చేత చపాతీలు చేయించిన హాస్టల్‌ సిబ్బంది

-

నిర్లక్ష్యం, అవినీతి దేశంలో రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు కొత్త కొత్త నిబంధనలు తీసుకువచ్చినా.. మాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. అయితే.. ఈ పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో దయనీయంగా మారింది. విద్యార్థులతోనే ఇప్పటికే పాచిపనులు చేయిస్తు్న్న ఘటనలు వెలుగులోకి వచ్చినా.. అప్పటికప్పుడు అధికారులపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. అయితే.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని కట్నీ జిల్లాలో దారుణం జరిగింది.

మధ్యప్రదేశ్‌లో విద్యార్థినుల చేత చపాతీలు చేయించిన హాస్టల్‌ సిబ్బంది..

జిల్లాలోని కస్తూర్బా గాంధీ హాస్టల్‌కు చెందిన విద్యార్థినుల చేత హాస్టల్‌ సిబ్బంది చపాతీలు చేయించారు. ఈ ఘటనను ఎవరో రహస్యంగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో స్కూల్‌ యూనిఫాంలో ఉన్న ఓ విద్యార్థిని పిండి పిసికి చపాతీలు తాలుస్తుండగా.. మరో విద్యార్థిని కాలుస్తూ కనిపించింది. వైరల్‌గా మారిన ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తడంతో సంబంధింత అధికారులు అప్రమత్తమయ్యారు. వీడియోను డిలీట్‌ చేయించి, ఘటనపై విచారణకు ఆదేశించారు. విద్యార్థినులు హాస్టల్లో ఉంటున్నది పని చేయడానికి కాదని, చదువుకోవడానికి వచ్చారని, ఈ ఘటనపై తాము విచారణ చేస్తున్నామని స్థానిక డీఈవో చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news